Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు జరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఒకదానికి తర్వాత ఒకటి అన్నట్లుగా జరుగుతున్న సంఘటనలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం దీనికి సంబంధించి కీలక నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారని సమాచారం.
Read More: Modi: రైతు వ్యతిరేక చట్టాలు మోడీ ఎప్పుడు ఉపసంహరించుకుంటారంటే…
ఎందుకు మంత్రివర్గ విస్తరణ?
ప్రధానంగా రెండు కారణాలతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందని సమాచారం. ఒకటి యూపీ, రాజస్థాన్ ఎన్నికలు. మరోఒకటి ఒకటి కంటే ఎక్కువ శాఖలను కీలక మంత్రులు నిర్వహిస్తుండటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు. పార్టీకి రెండు రాష్ట్రాల్లో ఊపు ఇచ్చేందుకు ఈ విస్తరణ ఉండనున్నట్లు సమచారం. ఇక కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం 20 ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న శాఖలను అర్హులతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 60 మంది కేంద్ర కేబినెట్ సభ్యులను 80 కి పెంచే అవకాశం ఉంది.
Read More: Modi: మోడీ కి పెద్ద రిలీఫ్… కరోనా సెకండ్ వేవ్ కష్టాలు తేలేదట
పదవి దక్కే యువనేత ఈయనేనా?
మధ్యప్రదేశ్ కీలక నేత, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింథియా కు త్వరలో జరగబోయే కేబినెట్ లో చోటు పక్కాగా దక్కబోతున్నట్టు సమాచారం. బీజేపీ మధ్యప్రదేశ్ లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు జ్యోతిరాదిత్య సింథియా అతి కీలక పాత్ర పోషించారు. అనంతరం సింథియాకు రాజ్యసభ సభ్యత్వం దక్కింది. దీనికి కొనసాగింపుగా కేబినెట్ విస్తరణలో సింథియాకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సింథియాతో పాటుగా మరి కొందరికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కనుంది.