Modi: కరోనా కల్లోలం సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రం ఆర్థిక కష్టాలు ఎదుర్కుంటుందని అంచనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కీలక అంచనా వచ్చింది. ప్రధాన ఆర్థిక సలహాదారు కె వి సుబ్రమణియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి గణాంకాలు విడుదల నేపథ్యంలో దేశ ఆర్థికవ్యవస్థపై సెకెండ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా కారణంగా ఏర్పడే అనిశ్చితి ఉందని ఆయన అన్నారు.
Read More : Corona: షాక్ఃకరోనా టీకా పనిచేయడం లేదని కేసు పెట్టాడు
అంచనాలు వేయడం కష్టమట…
కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ రెండంకెల వృద్ధిని సాధిస్తుందో లేదో అంచనా వేయడం కష్టమని ప్రధాన ఆర్థిక సలహాదారు కె వి సుబ్రమణియన్ తెలిపారు. అయినప్పటికీ సెకెండ్ వేవ్ ప్రభావం ఆర్థికవ్యవస్థపై అంత పెద్దగా ఉండదని సుబ్రమణియన్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆర్థికవ్యవస్థకు ఆర్థిక, ద్రవ్య మద్దతు ముఖ్యమని స్పష్టం చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, ఇది కరోనాను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుందని సుబ్రమణియన్ వెల్లడించారు.
Read More : KCR: కేసీఆర్ , జగన్ … ఒకే మాటపై ఉంటారట
ఐరాసా కూడా సానుకూలంగా…
ఇదిలా ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020లో భారత ఆర్థికవ్యవస్థ 6.9 శాతం కుదించుకుపోవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అయితే, 2021లో ‘బలంగా కోలుకోవడం’ ద్వారా 5 శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుందని అభిప్రాయపడింది. ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి విభాగం (యూఎన్సీటీఏడీ) తాజా నివేదిక ప్రకారం..2020లో కేంద్రం వెల్లడించిన ఉద్దీపన ప్రకటించిన స్థాయిలో అమలు కాలేదని, దీనివల్ల ఊహించిన దానికంటే తక్కువ ఆర్థిక పనితీరుకు దారితీసిందని వెల్లడించింది. ఇక, ఇటీవల ప్రకటించిన బడ్జెట్ డిమాండ్ను సృష్టించే దిశగా ఉందని, అలాగే, ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదలతో ఈ ఏడాది సానుకూలంగా ఉండొచ్చని తెలిపింది.