Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య ప్రభుత్వ పరంగా ఎత్తులు పై ఎత్తులు సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ సేవల విషయంలో ట్విస్టులు సాగుతున్నాయి. ఆయన్ను కొనసాగించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మమత షాక్ ఇచ్చారు. తన పంతం నెగ్గించుకునేందుకు ఆలాపన్ బందోపాధ్యాయను బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేయించి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. అయితే, ఈ విషయంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
Read More: Black fungus: షాక్ః కరోనా రాకపోయినా… బ్లాక్ ఫంగస్ ముప్పు మనకు ఉంటుందట
జరిగింది ఇది…
యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మమతా ఆలస్యంగా రాగా.. సీఎస్తో సహా ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో సీఎస్ ఆలపన్ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆయనను వెనక్కి పంపించేది లేదని మమతా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన పంతం నెగ్గించుకోవటానికి సోమవారం ఆలాపన్ బందోపాధ్యాయ బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా సీఎం మమతా బెనర్జీకి ముఖ్య సలహాదారుగా చేరిపోయారు. నెలకు రూ.2.5 లక్షల వేతనంతో ఆలాపన్ బందోపాధ్యాయను మమతా తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన మూడేళ్లపాటు ఆమె వద్ద పనిచేయనున్నారు.
Read More: Corona : కరోనా టైంలో మోడీ ఖాతాలో ఇంకో మచ్చ
అప్పట్లో మోడీ చెప్పడం
ఆలాపన్ బందోపాధ్యాయ పదవీ కాలం విషయంలో గతంలో మమత మాటకు ప్రధాని ఓకే చేయడం గమనార్హం. మమత కోరిక మేరకు కొద్దిరోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్కు ఆలాపన్ సేవలు అవసరమని భావిస్తున్న మమతఈ మేరకు ఆయన్ను ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు.