Cocktail: రోచే కంపెనీకి చెందిన యాంటీ బాడీస్ కాక్ టైల్ ఇంజక్షన్ గురించి ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. కరోనా ట్రీట్మెంట్ లో ఉపయోగించడంతో ఈ ఇంజక్షన్ విషయం వెలుగులోకి వచ్చింది.. తాజాగా ఈ ఔషధాన్ని 40 మంది కోవిడ్ రోగులకు అందించగా మంచి ఫలితాలు వచ్చాయని.. హైదరాబాద్ లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(AIGA) హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు..
Read More: Vaccination: టీకా వేంచుకోకపోతే ఫోన్ బ్లాక్ చేస్తారట.. ఎక్కడంటే..
యాంటీ బాడీస్ కాక్ టైల్ ఇంజక్షన్ వాడిన తరువాత వారిలో కరోనా లక్షణాలు తగ్గి సాధారణ స్థాయికి చేరుకున్నారని వివరించారు ఈ వైరస్ మ్యుటేషన్లను, స్పైక్ ప్రోటీన్ ని అంటి పెట్టుకొని అవి మానవ కణాలలోకి వెళ్ళకుండా ఎదుర్కోవడంలో ఈ డ్రగ్ విజయవంతంగా చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా కేవలం 24 గంటల్లోనే క్లినికల్ లక్షణాలు అయిన జ్వరం, నీరసం వంటి కరోనా లక్షణాలన్నీ మటుమాయం అయ్యాయని వివరించారు. ఈ డ్రగ్ ఇచ్చిన 40 మంది కరోనా పేషెంట్లలో 100 శాతం వైరస్ కనుమరుగైనట్లు ఆర్ టి పిసిఆర్ RTPCR పరీక్ష ద్వారా నిర్ధారించినట్లు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన మూడు నుంచి ఏడు రోజుల లోపే యాంటీబాడీస్ కాక్ టైల్ ఇంజక్షన్ ఇవ్వాలి. మన దేశంలో దీని ఖర్చు రూ.70,000 అవుతుంది.