Vaccination: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎందరో ప్రాణాలను బలితీసుకుంది.. కరోనాని నియంత్రణ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే సరైన అవగాహన లేక వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొంత మంది ప్రజలు విముఖత చూపిస్తున్నారు.. ఇలా వ్యాక్సిన్ వేయించుకోని వారి ఫోను బ్లాక్ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు ఇవ్వమని పాకిస్తాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది..!!
Read More: peanut Diamond: పీనట్ డైమండ్ ట్రైలర్ ను విడుదల చేసిన క్రిష్ జాగర్లమూడి..
అన్ని దేశాలతో పోల్చుకుంటే పాకిస్తాన్లో వాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. పాకిస్తాన్లో ఇప్పటి వరకు కోటి మందికి పైగా మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే, గడువు ముగిసినా రెండో రోజు వేయించుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. దీంతో 2 డోసు వేయించుకున్న వారి సంఖ్య భారీగా తగ్గింది.. వ్యాక్సినేషన్ పై ఉన్న అపోహల కారణంగా ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఎన్ని ప్రచారాలు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాకపోవడం లేదు. ప్రావిన్సులో ఒకటైన పంజాబ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నామమాత్రంగా జరగడంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోరో వారి మొబైల్ ఫోన్ నెట్ వర్క్ ను బ్లాక్ చేయించాలని నిర్ణయించింది. మొదట్లో ఇది ప్రతిపాదనకు పరిమితమైన, వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఇష్టపడకపోవడం వల్లనే దీనిని చట్టంగా తీసుకు వస్తున్నాం. అయితే ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయాన్ని టెలికాం సంస్థలు నిర్ణయిస్తాయని పంజాబ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మహమ్మద్ రజా వెల్లడించారు. ప్రావిన్స్లో వ్యాక్సింగ్ చేయించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు జులై ఎలా వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పాకిస్తాన్ లో 9.41 లక్షల మంది కరోనా బారిన పడగా.. 8.76 లక్షల మంది కోలుకున్నారు.. 21,633 మంది మరణించారు.