lord Shiva: శుభ ఫలితాలు
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. ఎందుకంటే సకల ప్రాణులకూ అధిపతి పరమేశ్వరుడు కాబట్టి ఆయన ఆజ్ఞ లేకుండా ఏమి జరగదు. ఆయన అనుగ్రహం ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని వదిలిపోతుంది. ఆ ఈశ్వరుడికి సోమవారం అంటే చాలా ప్రీతి. సోమవారం (Monday) శివుడి పూజ చేయడం వలన అనేక శుభ ఫలితాలు చాలా తేలికగా పొందుతాము. సోమవారం ఉమామహేశ్వరులనుపూజించడం వలన అష్టైశ్వర్యాలు కలగడం తో పాటు మనకున్న దారిద్ర్యము, సమస్యలు తొలగిపోవాలంటే శివుడిని ఈవిధంగా పూజించాలి.
lord Shiva: ఆవు నేతితో దీపారాధన
సోమవారంతెల్లవారు ఝామున నిద్ర లేచి తలస్నానం చేసి పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం పెట్టి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు పెట్టాలి తుమ్మి పూలు , మోదుగ పూలు చాల శ్రేష్టమైనవి గా చెప్పబడినవి. శివఅష్టోత్తరం (sivastotharam) చదువుతూ విభూదిని సమర్పిచి , ఆ విభూతిని నుదిటిన పెట్టుకోవాలి.సాయంత్రం వరకుపాలు , పండ్లు వంటివి తీసుకుంటూ ఉపవాసము ఉండి శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి . సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం పెట్టాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పులు , ఆర్థికపరమైన సమస్యలు తగ్గి ఐశ్వర్యవంతులు అవుతారు. దేవునికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రతతో పెట్టాలి . అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు.
శివునికి ప్రీతికరమైనది
మూడు ఆకులుఉన్న బిల్వపత్రం శివుని మూడు కనులకు , త్రిశూలానికి గుర్తుగా భావిస్తారు. ఈ బిల్వపత్రాన్నిమహా శివునికి సమర్పించడం వల్ల దారిద్రయం తొలగి శాంతి లభిస్తుంది. శివునికి ప్రసాదంగా ఏ పండైనాపెట్టవచ్చు. శివునికి ప్రీతికరమైనది మాత్రం వెలగపండు గా చెప్పబడింది. ఇది దీర్ఘాయిష్షును ఇస్తుంది. ఈ పండుని స్వామికిపెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది.అదేవిధం గా ఉమామహేశ్వరులకు వేకువ జామున చేసే పూజ ఎక్కువ ఫలితాన్నిఇస్తుంది.