NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Employees PRC: మంత్రుల కమిటీ చర్చల్లో పురోగతి… సమస్య పరిష్కార ధిశగా అడుగులు..

AP Employees PRC: పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఉద్యోగుల సమ్మె తేదీ దగ్గర పడుతుందటంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది. తొలుత మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ జరిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. శుక్రవారం రాత్రి దాదాపు అయిదు గంటల పాటు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చించింది. పలు డిమాండ్ల పై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

AP Employees PRC issue meeting
AP Employees PRC issue meeting

Read More: AP High Court: ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేలా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP Employees PRC: పలు అంశాల్లో సవరణలకు ప్రభుత్వం సుముఖత

మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ లు స్టీరింగ్ కమిటీ తరపున పాల్గొన్న 20 మంది ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వ ప్రతిపాదనలు వివరించారు. హెచ్ఆర్ఏ శ్లాబుల్లో మార్పులకు మంత్రులు అంగీకారం తెలిపారు. దీంతో పాటు అదనపు క్వాంటమ్ ఫించను, తదితర అంశాల్లో మార్పులు చేసేందుకు సంసిగ్ధత వ్యక్తం చేశారు.

హెచ్ఆర్ఏ నాలుగు స్లాబులు

హెచ్ఆర్ఏ నాలుగు స్లాబులు 8 శాతం, 12 శాతం, 16 శాతం, 24 శాతం ఇచ్చేందుకు మంత్రుల కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. సీపీఎస్ రద్దు పై మరో మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తోందని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపింది. మరో ఉప సంఘం చర్చలు దృష్ట్యా సమయం కావాలని కోరింది. ప్రభుత్వం సూచించిన అంశాలపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించిన తరువాత మంత్రుల కమిటీ ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. హెచ్ఆర్ఏ శ్లాబ్ లు పాతవే కొనసాగించాలనీ, 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని, ఓట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస టైమ్ స్కేల్, గ్రామ సచివాలయ సిబ్బందికి 2022 పిఆర్సీ స్కేల్ ఇవ్వాలని, మార్చి 31 లోగా సీపీఎస్ రద్దు పై నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్ర పీఆర్సీనే కొనసాగించాలని మంత్రుల కమిటీకి వెల్లడించారు.

కాగా శనివారం (నేడు) మధ్యాహ్నం 2 గంటలకు మరో సారి సమావేశం జరిపేందుకు నిర్ణయించింది మంత్రుల కమిటీ. అయితే కొన్ని అంశాలల్లో ఏకాభిప్రాయం కుదిరిందనీ, మరి కొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందనీ, చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నాయనీ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లకుండానే ప్రభుత్వం తమ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని సంఘ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju