Old Coins and Notes : పాత కరెన్సీ నోట్లు, పాత కాయిన్స్ మార్చాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేశీ కేంద్ర బ్యాంక్ RBI సూచించింది. ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా పాత నోట్లు, నాణేలను విక్రయించే వారు ఇటీవల మోసాల బారిన పడుతున్నారని హెచ్చరించింది. ఈ విషయంలో ఆర్బీఐకి ఎలాంటి సంబంధం ఉండదని గ్రహించాలని తెలిపింది. కొంత మంది ఆర్బీఐ తరుపున పాత కాయిన్స్, పాత నోట్ల కొనుగోలు, అమ్మకం విక్రయాలపై ఫీజులు వసూలు చేస్తున్నారని RBI తెలపడం గమనార్హం.
Old Coins and Notes : అలాంటి విషయాలలో RBIకి ఎలాంటి సంబంధం ఉండదు!
RBI పేరుతో ఎవరైనా కమిషన్ వసూలు చేస్తే అస్సలు నమ్మకండి అని ప్రజలకు సూచించింది. ఇకపోతే RBI తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు బ్యాడ్ న్యూస్ అందించింది. కొత్త కస్టమర్లను పేటీఎం పేమెంట్స్ బ్యాంకు చేర్చుకోకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని RBI తెలపడం గమనార్హం. ఇక ఇలాంటి మోసాలతో జాగ్రత్త వహించాలని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది. RBI తరుపున చార్జీలు వసూలు చేసుకోవచ్చని ఏ సంస్థ, కంపెనీ లేదంటే వ్యక్తులకు అనుమతులు ఇవ్వలేదని వివరించింది.
పేటీఎం పేమెంట్స్?
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు అనేది దేశంలోనే అతిపెద్ద యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ బెనిఫిషియరీ బ్యాంకు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకును పేటీఎం 2016 ఆగస్టులో ఏర్పాటు చేసింది. నోయిడాలోని తన బ్రాంచ్లో 2017 మే నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ప్రస్తుతం ఈ బ్యాంకుకు చైర్మన్గా ఉన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో మార్చి 31, 2021 నాటికి 64 మిలియన్ సేవింగ్స్ అకౌంట్లున్నాయి. రూ. 5,200 కోట్లపైన డిపాజిట్లను కలిగి ఉంది.