Rashmika Mandanna: కన్నడ భామ రష్మిక మందన “పుష్ప” సినిమాతో దేశంలో అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. “పుష్ప”లో రష్మిక మందన వేసిన స్టెప్స్.. చాలా మందిని ఆకట్టుకున్నాయి. “పుష్ప”తో ఒక్కసారిగా రష్మిక మందన ఇమేజ్ డబల్ త్రిబుల్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో “పుష్ప 2” చేస్తున్నా రష్మిక మందన.. కోలీవుడ్ ఇండస్ట్రీలో దళపతి విజయ్ వారసుడు సినిమాలో కూడా నటిస్తోంది. అంతమాత్రమే కాదు హిందీలో ఏకంగా రెండు భారీ ప్రాజెక్ట్ లు చేస్తోంది. ఇటువంటి తరుణంలో తాజాగా రష్మిక మందన మరో బంపరాఫర్ అందుకున్నట్టు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విషయంలోకి వెళ్తే “అర్జున్ రెడ్డి”తో ఓవర్ నైట్ లోనే తిరుగులేని స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రష్మిక మందన సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే రణబీర్ కపూర్ తో “యానిమల్” అనే సినిమా సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ లో రష్మిక మందన నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే రష్మిక స్టోరీ విన్నట్లు అంతా ఓకే చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలలో రష్మిక నటిస్తోంది. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రతిష్టాత్మకంగా రణబీర్ కపూర్ తో తెరకెక్కించబోయే “యానిమల్” సినిమాలో రష్మిక అవకాశం అందుకున్నట్లు.. లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. “పుష్ప”తో అంతర్జాతీయ స్థాయిలో రష్మిక మందనకి గుర్తింపు రావడంతో.. సందీప్ రెడ్డి వంగా ఆమెను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.