ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దూకుడు పెంచింది. హైదరాబాద్ లో మరొకరిని అదుపులోకి తీసుకుంది. అభిషేక్ రావు బోయనపల్లిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనూస్ బ్యూటీ పార్లర్ అధినేత అయిన అభిషేక్ రావు రాబిన్ డిస్టలరీస్ లో డైరెక్టర్ గా ఉన్నారు. రామచంద్ర పిళ్లై తో కలిసి అభిషేక్ రావు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు.
అభిషేక్ రావును నిన్న సీబీఐ విచారణ చేసింది. అయితే విచారణ లో సహకరించడం లేదన్న కారణంతో ఈ రోజు ఉదయం ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఈ లిక్కర్ కుంభకోణం కేసులో విజయ్ నాయర్ తర్వాత అభిషేక్ రావును అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇదే కేసులో ఇండోే స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రును ఈడీ అరెస్టు చేసి విచారణ జరుపుతోంది. అభిషేక్ రావును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఢిల్లీకి తీసుకువెళుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక పక్క సీబీఐ మరో పక్క ఈడీ దూకుడు పెంచడంతో సంబంధిత వ్యాపార వర్గాల్లో ఆందోళన పెరిగింది. ఇప్పటికే ఐడీ నాలుగు పర్యాయాలు వివిధ ప్రదేశాల్లో సోదాలు జరిపింది. సోదాల్లో వెలుగు చూసిన కీలక పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు, విచారణలో నిందితులు వెల్లడిస్తున్న సమాచారంతో అరెస్టులు జరుగుతున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు .. మరో సారి సోదాలు చేపట్టిన ఈడీ