YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఎండలకు తిరుగుతుండటంతో వడదెబ్బ తగిలిందని భావిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు షర్మిల వరంగల్లు, ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవేళ ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలన చేస్తుండగా వడదెబ్బకు షర్మిల సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు. వెంటనే వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీలేదని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
రజినీకాంత్ పై వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా.. తనదైన బాణీలో కొడాలి