తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు వాసులను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. జగజ్జనని చిట్ ఫండ్ జరిగిన మోసాలపై కేసు నమోదు చేసిన ఏపి సీఐడీ సదరు చిట్ ఫండ్ సంస్థకు డైరెక్టర్ లుగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అరెస్టు చేశారు.
జగజ్జనని చిట్ ఫండ్ మోసాలపై కాకినాడ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్లు, చిట్స్ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్లు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించి సీఐడీకి అధారులు ఇచ్చారు. ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్లు, పాల్స్ డిక్లరేషన్ ను అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించారు. 49 సబ్ స్క్రైబర్ ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలను అందించారు.
నిబంధనలకు విరుద్దంగా చిట్ ఫండ్ నిధులతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించడంతో 1982 చిట్ ఫండ్ చట్టాన్ని అల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసులో సీఐడీ అధికారులు ఇవేళ అదుపులోకి తీసుకున్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి తరలించారు. ఆదిరెడ్డి వాసు టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
YS Sharmila: వైఎస్ షర్మిలకు స్వల్ప అస్వస్థత