అందాల నటి శ్రీదేవి చనిపోయి ఏడాది కాలం దాటినా… అభిమానులు మాత్రం ఆమె జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు. అభిమానులకే అలా ఉంటే ఆమె భర్త బోనికపూర్, పిల్లలకు ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఉదాహరణగా ఓ ఘటన జరిగింది. `ఔర్ ఏక్ కహానీ` అనే షోకు బోనీ కపూర్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు కోమల్ నాథ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అందులో కోమల్నాథ్ `మీరు ఏ క్షణంలోనైనా శ్రీదేవిని మరచిపోయారా?` అని ప్రశ్నించారు. అందుకు బోనీ కపూర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను మరచిపోవడం ఆసాధ్యం అంటూ బదులిచ్చారు. అలాగే తాను ఆర్ధికంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు కుటుంబం నుండి చాలా మంచి మద్దతు లభించిందని తెలిపారు బోనీ కపూర్.
previous post
next post