అందాల నటి శ్రీదేవి చనిపోయి ఏడాది కాలం దాటినా… అభిమానులు మాత్రం ఆమె జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు. అభిమానులకే అలా ఉంటే ఆమె భర్త బోనికపూర్, పిల్లలకు ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఉదాహరణగా ఓ ఘటన జరిగింది. `ఔర్ ఏక్ కహానీ` అనే షోకు బోనీ కపూర్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంకు కోమల్ నాథ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అందులో కోమల్నాథ్ `మీరు ఏ క్షణంలోనైనా శ్రీదేవిని మరచిపోయారా?` అని ప్రశ్నించారు. అందుకు బోనీ కపూర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను మరచిపోవడం ఆసాధ్యం అంటూ బదులిచ్చారు. అలాగే తాను ఆర్ధికంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు కుటుంబం నుండి చాలా మంచి మద్దతు లభించిందని తెలిపారు బోనీ కపూర్.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!