Tirumala: తిరుమల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భక్తులకు సాక్షాత్తు తాము శ్రీవారి ఆలయంలో ఉన్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా మ్యూజియం పనులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి కోరారు. టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం ఆయన టిసిఎస్, మ్యాప్ సంస్థల అధికారులు, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మ్యూజియం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. మ్యూజియంలోని ఒకటో జోన్లో ఆలయ అనుభూతి కల్పించే పనులు, రెండో జోన్లో అన్నమయ్య గ్యాలరీ, ధ్యానమందిరం, స్వామి వారి ఆభరణాలు, నాణేలు, పురాతన వస్తువులు హోలోగ్రామ్ టెక్నాలజీతో ప్రదర్శించే ఏర్పాటు చేయాలన్నారు. ఆభరణాల 3డి ఇమేజింగ్ ద్వారా భక్తులు తాము స్వామి వారి నిజమైన ఆభరణాలు చూస్తున్నామనే అనుభూతి కల్పించాలని చెప్పారు.
CM Jagan: విశాఖలో ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్ .. సీఎం జగన్
మూడో జోన్లో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కళ్లకు కట్టినట్టు కనిపించేలా అందరూ సమష్టి కృషి చేయాలని సూచించారు. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు సందర్శించే మ్యూజియం పనుల్లో నిమగ్నమైన వారు మనసు లగ్నం చేసి భక్తితో పని చేయాలని కోరారు. టిసిఎస్, మ్యాప్ సంస్థల ప్రతినిధులు మ్యూజియం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లపై పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వేద వర్సిటీ విసి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 జగదీశ్వర్రెడ్డి, శ్రీవారి ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు, మ్యూజియం నిపుణులు ప్రొఫెసర్ కులకర్ణి, శివనాగిరెడ్డి, ఎవిఎస్.రెడ్డి, మ్యూజియం ఆర్కిటెక్ట్ శరత్, మ్యాప్ సిస్టమ్స్ అధికారి శరణ్, టిసిఎస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీ భీమశేఖర్, పాల్గొన్నారు.
NDA Vs INDIA: ఇండియా కూటమిపై బీజేపీ గేమ్ ప్లాన్..? విచ్చిన్నం వర్క్ అవుట్ అవుతుందా..?