Bro: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కలసిన మెగా మల్టీ స్టారర్ బ్రో సినిమా జులై 28 తారీకు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో శ్యాంబాబు పాత్ర మంత్రి అంబాటి రాంబాబు ఉద్దేశించి కావాలని పెట్టారని రాజకీయంగా పవన్ ఈ రకంగా విమర్శలు సినిమా ద్వారా చేశారని ప్రచారం జరుగుతుంది. శ్యాంబాబు పాత్రలో కమెడియన్ పృథ్వి నటించారు. ఏడాది సంక్రాంతి పండుగ టైములో అంబాటి రాంబాబు తన సొంత నియోజకవర్గం లో చేసిన డ్యాన్స్ తరహా మాదిరిగానే కాస్ట్యూమ్స్ కూడా ఆదే రీతిలో నటుడు పృథ్వి వేయడం జరిగింది. దీంతో మంత్రి అంబాటి ఈ సీనుపై రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు చేతకాక ఈ రకంగా సినిమా రంగాన్ని.. ఉపయోగించుకుని.. రాజకీయ ప్రత్యర్థుల పేర్లు పెట్టి దూషించి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శలు చేశారు.
ఇదే సమయంలో బ్రో సినిమా నిర్మాత విశ్వ ప్రసాద్.. చేత చంద్రబాబు అమెరికాలో డబ్బులు ఇచ్చి హవాలా రూపంలో పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీ అందిస్తున్నారని ఆరోపించారు. బ్రో సినిమా నిర్మాత తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. ఈ సినిమా అందువల్లే అట్టర్ ఫ్లాప్ అయ్యిందని రాజకీయ ప్రత్యర్థులపై ఈ రకంగా వ్యవహరిస్తే ప్రేక్షకులు కూడా ఆదరించాలని విమర్శలు చేశారు. ఈ క్రమంలో అంబాటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై బ్రో సినిమా నిర్మాత విశ్వప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. సినిమా ఆడటం లేదని మంత్రి రాంబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
వినోదాత్మకమైన సినిమాపై రాజకీయపరంగా విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. సినిమాపై మంత్రి చేస్తున్నారో పనులన్నీ అవాస్తవమని ఊహాజనితమే అంటూ కొట్టి పారేశారు. ఇదే సమయంలో నిర్మాతగా సినిమాకి పెట్టిన పెట్టుబడులపై అంబాటి రాంబాబు చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేదని ట్యాక్సీ లకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని తాము మరియు జీటీవీ కలిసి ఈ సినిమాని నిర్మించినట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో తనకు అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిర్మాత విశ్వప్రసాద్ వ్యాఖ్యానించారు.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?