Pawan Kalyan: ఇటీవల తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో ప్రొడ్యూసర్ దిల్ రాజు గెలుపొందారు. నిర్మాత సీ. కళ్యాణ్ కూడా పోటీ పడగా దిల్ రాజు విజయం సాధించడం జరిగింది. ఈ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ 25 కాగా దిల్ రాజు 31 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ప్రొడ్యూసర్ సెక్టార్ లో మొత్తం 12 స్థానాలలో ఏడింటిలో దిల్ రాజు ప్యానల్ గెలుపొందడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో రెండు ప్యానల్స్ నుంచి చిర ఆరుగురు గెలుపును అందుకున్నారు. ఎగ్జిబిటర్ సెక్టార్ లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు దిల్ రాజుకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. స్టూడియో సెక్టార్ లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ కి చెందినవారే ఈ సందర్భంగా దిల్ రాజు ప్యానల్ సభ్యులను అభినందిస్తూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గానికి అభినందనలు అంటూ..తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు. అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజు గారు, ఉపాధ్యకులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి, సెక్టార్ కౌన్సిల్ చైర్మన్లు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్నాను. ఒక సినిమా నిర్మితమవుతోందంటే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. రూ.కోట్ల సంపద సృష్టి జరుగుతుంది. పన్నులు చెల్లిస్తారు.
తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది. కాబట్టి పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నాను” అని అభినందించారు. జులై 30న ఎన్నికలు జరగగా ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు, కార్యదర్శిగా దామోదర ప్రసాద్, కోశాధికారిగా ప్రసన్న కుమార్ గెలిచారు. ఈ సందర్భంగా గెలిచిన వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.