వారిద్దరూ అన్నదమ్ములు. నిన్న మొన్నటి వరకు ఒకే పార్టీ టీడీపీలో ఉన్నారు. అయితే.. కుటుంబ తగా దాల నేపథ్యంలో ఎడమొహం.. పెడమొహం .. అన్నట్టుగా వ్యవహరించారు. చివరకు ఇప్పుడు పార్టీలు కూడా మారిపోయారు. వారే కేశినేని బ్రదర్స్. ఎంపీ కేశినేని నాని.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయన సోదరుడు చిన్ని టీడీపీలో ఉన్నారు. వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. రాజకీయాలను వేడె క్కించారు. ఇంకా వేడెక్కిస్తున్నారు.
అయితే.. ఇప్పుడు వీరి విషయం విజయవాడలో హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికల్లో వీరు విజయ వాడ ఎంపీ సీటును ఆశిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగుగా ఉన్న నాని.. వైసీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లిస్టులో కేశినేని నానిని జగన్ విజయవాడ పార్లమెంటు ఇన్చార్జ్గా నియమించారు. సో నానియే విజయవాడ పార్లమెంటుకు వైసీపీ నుంచి పోటీ చేయడం ఖరారు అయ్యింది. ఇక తొలి అరంగేట్రంతోనే విజయవాడ ఎంపీగా విజయం దక్కించుకోవాలని చిన్న చూస్తున్నారు. దీంతో ఇరు పక్షాలు కూడా.. యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. నాని విషయం పక్కన పెడితే.. చిన్ని ఏకంగా.. నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇరువురు కూడా సై.. అంటే సై.. అన్నట్టుగా పరిస్థితిని ఎదుర్కొనక తప్పదనే వాదన కూ డా వచ్చింది. కానీ.. ఇంతలోనే పరిస్థితి యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కేశినేని చిన్ని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నానికి టికెట్ ఇవ్వబోదన్నారు. వేరేవారికి అవకాశం ఇస్తారని, కేవలం నానిని ఆడించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది.. వాస్తవమా? కాదా? అనేది పక్కన పెడితే.. నాని వర్గంలో గందరగోళం అయితే తలెత్తింది.
ఇదిలావుంటే.. మరోవైపు టీడీపీ టికెట్పై పోటీ చేయాలని బావిస్తున్న కేశినేని చిన్ని పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదని.. నాని వర్గం అంటోంది. ప్రస్తుతం జరుగుతున్న టికెట్ల కసరత్తు వ్యవహారంలో.. విజయ వాడను బీజేపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ టికెట్ను ఇచ్చితీరాలన్నట్టుగా పట్టుబడుతు న్నట్టు సమాచారం. టికెట్ ఇస్తే.. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలియడంతో.. విజయవాడ టీడీపీ టికెట్ వ్యవహారం డోలాయమానంలో పడింది. దీంతో కేశినేని బ్రదర్స్.. విషయంలో క్లారిటీ వచ్చినట్టేనా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.