ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 293, ఇండియా కూటమికి 234 లోక్ సభ స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీకే 303 స్థానాలు రావడంతో భాగస్వామ్య పక్షాలపై ఆధారపడకుండానే ప్రధాని మోడీ పరిపాలన సాగించారు. అయిదేళ్లు ఆయనపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఎటువంటి వత్తిడి లేకుండా పోయింది.
అయితే ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు తక్కువగా బీజేపీకి 240 స్థానాలు వచ్చాయి. దీంతో లోక్ సభలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత స్థానంలో తెలుగుదేశం (చంద్రబాబు 16), జేడీయూ (నితీష్ కుమార్ 12) పార్టీలు ఉన్నాయి. దీంతో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడియూ కీలకంగా మారాయి.
దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ .. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తమ డిమాండ్లతో మోదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే అర్థం వచ్చేలా ఓ సెటైరికల్ ఫొటోను కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో మోదీకి మనశ్శాంతి లేకుండా చంద్రబాబు, నితీశ్ ఆయన చేతులను చెరోపక్క లాగుతున్నట్లు ఉంది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కేంద్ర ప్రభుత్వంలో ఈ ఇద్దరు నేతలు కీలకంగా మారడంతో ఏపీ, బీహార్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు, నితీష్ కుమార్ పట్టుబట్టి సాధించుకునే పరిస్థితి ఉందనే టాక్ నడుస్తొంది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం నరేంద్ర మోడీ మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నకున్నారు.
https://x.com/INCIndia/status/1798655099830501422