అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆ పదవిలో కొనసాగిన నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు రాజకుమారి అందజేసిన వెంటనే ఆయన ఆమోదించారు. దీంతో ప్రభుత్వం వాసిరెడ్డి పద్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన వాసిరెడ్డి పద్మ 2011లో వైసిపిలో చేరారు. అప్పటి నుండి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ అధికార ప్రతినిధిగా టివి చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, నాటి అధికారపక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, ప్రత్యర్థి పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడం ద్వారా ఆమె గుర్తింపు పొందారు. పద్మ కృషిని గుర్తించిన పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ ఆమెను ఈ పదవికి ఎంపిక చేశారు.