పోలవరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం ముంచెత్తడంతో పోలవరం మండలంలోని 19 గ్రామాలకు పది రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న జగన్ నేరుగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. వరద ముంపుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు.
పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే https://t.co/MgRZXupUML pic.twitter.com/qcaQff1TJK
— YSR Congress Party (@YSRCParty) August 8, 2019