త్వరలో ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ నిప్రక్షాళన చేసే సూచనలు గోచరిస్తున్నాయి ఈనెల 18వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకట రమణలు పెద్దల సభకు వెళ్లనున్నారు.
ఈ కారణంగా ఖాళీ అయిన రెండు మంత్రి పదవులతోపాటు పనితీరు సరిగ్గా లేని వివాదాస్పద లైన మరికొందరిని కూడా తప్పించి స్వల్పంగా తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరించాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.దీంతో ఆశావహులు చాలామంది మంత్రి పదవులు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు .ఈ రేసులో నగరి శాసనసభ్యురాలు ఏపీఐఐసీ చైర్మన్ రోజా ముందంజలో ఉన్నారంటున్నారు.జగన్ తొలి కేబినెట్లోనే రోజాకు స్థానం లభించాల్సి ఉన్నప్పటికీ కుల సమీకరణాల వల్ల అది సాధ్యపడలేదు.అయితే అందుకు నొచ్చుకున్న రోజాను ఏపీఐఐసీ చైర్మన్ పదవిచ్చి జగన్ బుజ్జగించారు.కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో స్థానం దొరుకుతుందని జగన్ రోజా గంపెడాశతో ఉన్నారు.తన ట్రాక్ రికార్డు,పార్టీకి చేసిన సేవలు, టిడిపిపై చేసిన యుద్ధం తదితర అంశాలను జగన్ పరిగణనలోకి తీసుకుని తనకు మంత్రి పదవి ఇస్తారన్నది రోజా అంచనా.అయితే రోజాకు రాయలసీమకే చెందిన ఇద్దరు మంత్రులు అడ్డుపడుతున్నారని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.రోజా గనుక మంత్రి అయితే ఆమె ఎదగడంతో పాటు తమకిక రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయం వారిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది
అందువల్ల ఆ ఇద్దరు మంత్రులు రోజాకు మంత్రి పదవి రాకుండా అడ్డుచక్రాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారని వైసీపీ వర్గాలు చెప్పాయి.రోజా కల ఈసారైనా సాకారం అవుతుందో లేదో వేచి చూద్దాం