కరకట్టపై టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తునకు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లింగమనేని రమేష్ తో పాటు మాజీ మంత్రి నారాయణ ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ కోరగా, వాదనలు ముగియడంతో ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. లింగమనేని గెస్ట్ హస్ ను జప్తు చేయడంతో పాటు నారాయణ ఆస్తులను పాక్షికంగా జప్తు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆ ఆస్తులను తాము విక్రయించబోమని సెక్షన్ 8 ప్రకారం అఫిడవిట్ దాఖలు చేసుకునేందుకు ప్రతివాదులకు కోర్టు అవకాశం ఇచ్చింది. లింగమనేని రమేష్ కు నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కరకట్ట దగ్గర లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ లో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. అయితే ఈ గెస్ట్ హౌస్ ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీ సీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లలో లింగమనేనికి చంద్రబాబు లబ్ది చేకూర్చి బదులుగా ఆ ఇంటిని గెస్ట్ హౌస్ గా పొందారని సీఐడీ చెబుతోంది.
Breaking: అమ్మోనియా గ్యాస్ లీక్ .. 15 మందికి అస్వస్థత