AP SEC: రాష్ట్రంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపి హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అనుసరించలేదన్న కారణంగా సింగిల్ జడ్జి కోర్టు ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మరల నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టులో గురువారం (రేపు) విచారణ జరిగే అవకాశం ఉంది.
ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన రోజే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.