Breaking: కరోనా నేపథ్యంలో జెఈఈ మెయిన్స్ -2021 పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 27,28,29 తేదీలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తదుపరి పరీక్షల తేదీలను 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఫిబ్రవరి, మార్చిలో ఇప్పటికే రెండు సెషన్సు పూర్తి అయ్యాయి. కరోనా కేసులు విపరీతంగా పెరుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయడంతో పాటు ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా దేశంలో రెండు లక్షల 50వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.