By Election Results: ఏపిలోని తిరుపతి పార్లమెంట్, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ అధిక్యతలో కొనసాగుతున్నారు. తిరుపతిలో ఆరవరౌండ్ లు పూర్తి అయ్యే సరికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి 22వేల ఓట్లకుపైగా అధిక్యతలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 47,095 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 24,811, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 3694 ఓట్లు వచ్చాయి. 22,287 ఓట్లతో వైసీపీ అధిక్యంలో దూసుకువెళుతోంది.
ఇక నాగార్జునసాగర్ లో ఆరవ రౌండ్ లు పూర్తి అయ్యేసరికి టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ 5వేల ఓట్లకుపైగా ఆధిక్యతలో ఉన్నారు. తిరుపతిలో రెండవ స్థానంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఉండగా, సాగర్ లో రెండవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఉన్నారు. తొలి రౌండ్ నుండి ఇటు తిరుపతిలో వైసీపీ, సాగర్ లో టీఆర్ఎస్ ఆధిక్యతతో ముందుకు దూసుకువెళుతోంది. దీంతో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.