YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుండి పార్టీలోని ముఖ్య నేతలు, సన్నిహితుల ఇళ్లలో వేడుకలకు విధిగా హజరై వాళ్ల కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా మంత్రి జోగి రమేష్ ఇంట జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు. మంత్రి జోగి రమేష్ కుమార్తె వివాహ వేడుకకు హజరైయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధువరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో మంత్రి జోగి రమేష్ కుమార్తె వేడుక జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా వధువు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్ సతీష్ గుత్తేదార్ లను సీఎం జగన్ ఆశీర్వదించారు. దీంతో జోగి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. కాగా, పలువురు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఈ వివాహ వేడుకకు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ED: పార్టీ మారిన ఫలితం .. దెబ్బపడింది(గా)..!