తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద నీటితో పొటెత్తుతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. రాజమండ్రి సమీపంలోని దవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.3 అడుగులకు చేరుకుంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు మరి కొద్ది సేపటిలో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో బ్యారేజీ వద్ద 175 గేట్లు ను ఎత్తి 12.10 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి విడుదల చేశారు.
వరద నీరు పెద్ద ఎత్తున సముద్రంలోకి వదులుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధికారులు అంచనా వేస్తూ సూచనలు జారీ చేస్తున్నారు. మరో పక్క ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా 200 బోట్లను సిద్ధం చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర భద్రాలయం వద్ద నీటి మట్టం 53.4 అడుగులకు పెరిగింది. అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలంలోని రామలయ మాట వీధులు, అన్నదాన సత్రం తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆ ప్రాంతంలోని సుమారు 600 మందిని పునరావాస శిబిరాలకు అధికారులు తరలించారు. తెలంగాణలో సీఎం కేసిఆర్, ఏపిలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వరదలపై అధికార యంత్రాంగంతో సమీక్షలు జరిపి తగు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు.
ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి.. తలుపులు, కిటికీలు ధ్వంసం