GOOD NEWS TO BOOZERS: న్యూఇయర్ వేడుకల వేళ మందు బాబులకు ఏపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా ప్రతి ఎటా డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలలో మద్యం అమ్మాకాలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. యువకుల నుండి పెద్ద వాళ్ల వరకూ మద్యం అలవాటు ఉన్న వారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పార్టీలు చేసుకుంటూ ఉంటారు. పట్టణాల్లో పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. అయితే మందు బాబుల సౌకర్యం కోసం ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ వేడుకల కోసం మద్యం అమ్మకాల సమయాల్లో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం ఏపీలో ప్రతి రోజూ 9 గంటల వరకే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని మద్యం దుకాణ సమయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే మద్యం దుకాణాల వద్ద సేవించడానికి వీలులేదు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం కేసులు నమోదు చేసి అరెస్టు చేసేస్తారు. ఈ రోజు రేపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఇప్పటికే పోలీస్ శాఖ అధికారులు నిర్ణయించారు. షాపులు ఒంటి గంట వరకూ అనుమతించారు కదా అని మద్యం సేవించి వాహనం నడుపుతూ వెళితే మాత్రం కేసులు నమోదు చేస్తారు. షాపుల్లో మద్యం విక్రయాలకు మాత్రమే సమయం పెంచింది ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా ఏపి ప్రభుత్వం కూడా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.