ఏపి andhra pradeshలో స్థానిక సంస్థల ఎన్నికల local body elections నిర్వహణపై అభ్యంతరాలను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏస్ఈసీ) sec నిమ్మగడ్డ రమేష్ కుమార్ nimmagadda ramesh kumarతో బేటీ అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ adityanath das, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, అనిల్ కుమార్ సింఘాల్ లు ఏస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సమావేశమైయ్యారు.
పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని కమిషన్ ప్రోసీడింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం..ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకోవాల్సిందిగా ఆదేశించింది. ముగ్గురు సీనియర్ అధికారులను ఎస్ఈసీ వద్దకు ప్రభుత్వం పంపాలనీ, రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలనీ హైకోర్టు సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ తదితర విషయాలపై పరిశీలన జరిపి ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందనీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలనీ హైకోర్టు ధర్మాసనం ఆదేశించి. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను క్లోజ్ చేసింది. హైకోర్టు ఆదేశాల పై ప్రభుత్వం తరపున సీఎస్ ఆదిత్యనాధ్ దాస్, ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, అనిల్ కుమార్ సింగ్లు ఎస్ఈసీతో భేటీ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం రెండు కరోనా వ్యాక్సిన్ల వినియోగానికి అత్యవసర అనమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సినేషన్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా డ్రైరన్ కూడా రెండు సార్లు నిర్వహించారు. మరి కొద్ది రోజుల్లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వ్యాక్సినేషన్ పై ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధుల బందంతో భేటీ అనంతరం ఎస్ఈసీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.