బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్ లు అందరూ పూర్తిగా బిజీ అయిపోయారు. విన్నర్ అభిజిత్, రన్నరప్ అఖిల్, మూడవ స్థానంలో నిలిచిన సోహెల్ ముగ్గురు సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. వీరు ముగ్గురు కాకుండా మిగిలిన వారికి కూడా అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి.
ఇక బయటకు వచ్చిన తర్వాత అందరికీ నా మొదటి ఎక్కువ లాభపడింది సోహెల్ అని చెప్పాలి. 25 లక్షలు తీసుకొని ఆటతీరును మార్చేశాడు. ఇక అంతే కాకుండా అందరికంటే ముందుగా తాను హీరోగా విడుదల కాబోయే సినిమాను కూడా ప్రకటించేశాడు. అభిజిత్ మరొకవైపు సరైన స్క్రిప్ట్ కోసం సరైన సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ఆత్రుతగా ఉన్నాడు. అందుకోసమే తన పూర్తి సమయాన్ని స్క్రిప్టులు వినడానికి కేటాయించటం జరిగింది.
చాలా ఆఫర్లు వస్తున్నాయని అయితే సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాను అని ముందే చెప్పాడు. తాజాగా లైవ్ లోకి వచ్చిన అతను ప్రేక్షకులతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నాడు. కొన్ని స్క్రిప్టులు వచ్చాయి కానీ డైలాగ్స్ మళ్లీ రాయాలి అనిపించింది. ఫిక్స్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పాడు.
అలాగే తన ఫ్యాన్స్ ను ఎలాంటి సినిమాలు చేయాలి అని అడిగాడు. వెరైటీ గా ట్రెండీ గా ఉండే సినిమా చేయాలా..? రొమాన్స్ కామెడీ చేయాలా లేదా..? లేక పక్కా తెలుగు కమర్షియల్ చేయాలా అని అడిగాడు. తనకు కన్ఫ్యూజన్ ఉందని… సినిమా అనౌన్స్ చేయడం పెద్ద విషయం కాదు కానీ సరైన సినిమా చేయాలని అభి చెప్పాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!