Breaking: గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్ధినులు అదృశ్యం కావడం నెల్లూరు జిల్లా రాపూరులో తీవ్ర కలకలాన్ని రేపింది. రాపూరులోని గిరిజన ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధినులు నిన్న సాయంత్రం నుండి కనబడకుండా పోయారు. గురుకుల పాఠశాలలో నిత్యం ఉదయం, రాత్రి విద్యార్ధినుల హజరు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి హజరు తీసుకుంటున్న సమయంలో ముగ్గురు విద్యార్ధినులు జ్యోతి, నాగమణి, అంకిత లు మిస్సింగ్ అయినట్లు గుర్తించారు. వీరు ముగ్గురు పదవ తరగతి చదువుతున్నారు. విద్యార్ధినులు అదృశ్యమైన విషయాన్ని వెంటనే గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమాచారం తెలియడంతో ఆ విద్యార్ధినులు తల్లిదండ్రులు మంగళవారం ఉదయం గురుకుల పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఆ విద్యార్ధినుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్దకు కన్నీరుమున్నీరు అవుతున్నారు. విద్యార్ధినులు కనిపించకుండా పోవడం పట్ల విద్యార్ధినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన బాలికల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్ధినులు వాళ్లంతట వాళ్లే వెళ్లారా.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.