Heart Stroke : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్నికల విధులను నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడు గుండె పోటుతో మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
అల్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. సహచర సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు.