Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకానికి సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ లను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుపై ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు స్పందించారు. హైకోర్టు తీర్పును మరో సారి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు.
ప్రభుత్వానికి అనేక ఎదురుదెబ్బలు తగిలినా బుద్ది రావడం లేదని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశించినా ఇఓ ఇప్పటి వరకూ తనను కలవలేదని, తన ఆదేశాలను పట్టించుకోవడం లేదని అన్నారు. ట్రస్ట్ చైర్మన్గా సంచయిత గజపతిరాజు చేసింది తక్కువ, హాడావుడి ఎక్కువ అని సెటైర్ వేశారు. తన ఆర్భాటం కోసం ట్రస్ నిధులు కోటి రూపాయలతో కార్లు కొనుగోలు చేశారని చెప్పారు.
సింహచలం ఆలయ భూముల విషయంలో ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రభుత్వ విచారణ కమిటీపై తనకేమీ ఆందోళన లేదని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.