Tirupati bus Accident: చిత్తూరు జిల్లా బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రెండు లక్షల వంతున ఎక్స్ గ్రేషియా ప్రకటన. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని భాకరాపేట ఘాట్ రోడ్ లో గత రాత్రి పెళ్లి బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఏడుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. 45 మంది గాయపడగా తిరుపతి రుయా ఆస్పత్రిలో 32 మంది, సిమ్స్ లో 7 గురు, బార్డ్ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.
Tirupati bus Accident: మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం
ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి మోడీ, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున. క్షతగాత్రులకు 50 వేల వంతున ఎస్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల గురించి అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పి సహాయక చర్యలను పరిరక్షించాలని చెప్పారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు వివరించారు.
Tirupati: క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
కాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. తక్షణం స్పందించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. భాకరాపేట ఘాట్లో తక్షణం రైలింగ్ ఏర్పాటుకు ఆదేశిస్తానని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆ రోడ్డులో రైలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ. 1500 కోట్లతో అక్కడ నాలుగు లైన్లు రోడ్డు మంజూరు అయ్యిందని గుర్తుచేశారు. ఆ రోడ్డు నిర్మాణం సమయంలో పూర్తి స్థాయిలో పర్మనెంట్ రైలింగ్కు చర్యలు తీసుకుంటామని తెలిపారు.