PMGKY Ration Distribution: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నవంబర్ నెల వరకూ రేషన్ కార్డుదారులకు మనిషికి 5 కేజీల చొప్పున ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే గత నెల రాష్ట్ర నెల రాష్ట్ర ప్రభుత్వం డోర్ డెలివరీ వాహనాల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం అందించే బియ్యంతో పాటు పిఎంజికేవై బియ్యం పంపిణీ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత రేషన్ కు ప్రధాన మంత్రి మోడీ లేకుండా సీఎం జగన్ ఫోటోతోనే పంపిణీ చేస్తున్నారన్న విమర్శలు రావడంతో ఈ నెల నుండి రెండు దఫాలుగా రేషన్ పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 18 వ తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వం డోర్ డెలివరీ వాహనాల ద్వారా బియ్యం, కందిపప్పు, పంచదార వంటి రేషన్ వస్తువులను కార్డుదారులకు పంపిణీ చేశారు. ఈ నెల 20వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన పీఎంజికేఏవై బియ్యం రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం రేషన్ షాపుల వద్ద ప్రత్యేకంగా సీఎం జగన్, పిఎం మోడీ ఫోటోలతో ప్రత్యేకంగా బ్యానర్ లను ఏర్పాటు చేశారు.
అయితే ఇక్కడ వరకూ బాగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుండి పిఎంజీకెఏవై బియ్యం పంపిణీ ప్రారంభం కాగా ఇపాస్ సర్వర్ ల సమస్య తలెత్తిందంట. దీంతో రేషన్ షాపుల వద్ద గంటల తరబడి కార్డుదారులు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందట. నిన్న అంటే మంగళవారం కొంత మేర సర్వర్ పని చేసినప్పటికీ బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ సర్వర్ పూర్తిగా మోరాయించడంతో కార్డుదారులు సర్వర్ ఎప్పుడు పని చేస్తుందో అంటూ రేషన్ షాపులకు చక్కర్లు కొడుతున్నారు. నడవలేని వారు, వృద్ధులు, మహిళలు మరి కొద్దిసేపటికి అయినా పని చేస్తుందో అంటూ పనులు అన్ని మానుకొని రేషన్ షాపుల వద్ద నిరీక్షణ చేస్తున్నారుట. కార్డుదారులు, రేషన్ డీలర్ లు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే అసలు సమస్య అప్పుడు వివరించారు.
PMGKY Ration Distribution: సమస్య ఏమిటంటే..
ఏపికి సంబంధించిన ఎన్ఐసీ సర్వర్ కూడా ఇటీవల కాలం వరకూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉంది. సదరు సర్వర్ ను ఇప్పుడు ఏపికి మార్పు చేయడంతో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులకు సంబంధించి ఇపాస్ మిషన్ లు పని చేయడం లేదుట. దీంతో కార్డుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నారు. ఈపాస్ సర్వర్ లో ఏర్పడిన సాంకేతిక ఎర్రర్స్ సాల్వ్ చేసే పనిలో సిబ్బంది ఉన్నారని కొద్ది గంటల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎన్ఐసీ అధికారులు డీలర్ల సంఘం నేతలకు తెలియజేసినట్లు సమాచారం.