Post Office Scheme: సీనియర్ సిటిజెన్స్ లబ్దిదారుల కోసం పోస్టల్ శాఖ మంచి ప్రయోజనకర పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం ద్వారా 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ నకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పథకం కింద లబ్దిదారులు కేవలం అయిదేళ్లలో రూ.4లక్షల వరకూ లాభం పొందవచ్చు.
60 ఏళ్లు పైబడిన వారు, లేదా స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన వారు ఈ పథకం కింద ఖాతా తెరవవచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి అయిదేళ్లు. వినియోగదారులు కోరుకుంటే ఈ కాలపరిమితిని కూడా పొడిగించుకోవచ్చు. ఈ పథకాన్ని మెచ్యూరిటీ తర్వాత మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో చేరడానికి ఖాతా తెరవడానికి కనీస మొత్తంగా వెయ్యి రూపాయలు నిర్ణయించారు. ఈ ఖాతాలో రూ.15లక్షల కు మించి డిపాజిట్ చేసే అవకాశం లేదు.
పథకంలో రూ.10లక్షలు పెట్టుబడి పెడితే అయిదేళ్ల తరువాత ఏటా 7.4 శాతం (కాంపౌండింగ్) వడ్డీ రేటుతో మెచ్యూరిటీ అనంతరం రూ.14,28,964లు పొందవచ్చు. వడ్డీ పదివేల రూపాయలన్నా ఎక్కువ ఉంటేనే టీడీఎస్ తగ్గించబడుతుంది. కానీ సీనియర్ సిటిజెన్లు ఈ పథకం పై అదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 60 సి కింద ఆదాయపు పున్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం కింద డిపాజిటర్ వ్యక్తి లేదా అతని భార్య లేదా భర్తతో కలిసి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరిచే అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచే, మూసి వేసే సమయంలో నామినేషన్ సౌకర్యం లభిస్తుంది.