SEC : రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కంపు సందర్భంలో వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఎస్ఈసీ కౌంటింగ్ ప్రక్రియపై తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. అతి తక్కువ ఓట్లు తేడా ఉంటేనే రీకౌంటింగ్ కు అనుమతి ఇవ్వాలనీ, అది కూడా ఒక్క సారి మాత్రమే రీకౌంటింగ్ చేయాలనీ ఆదేశించింది. వెబ్ కాస్టింగ్ తో వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా పేర్కొంది. అభ్యర్థి ఎవరు కోరినా కౌంటింగ్ రికార్డు చేయాల్సిందేనని తెలిపింది.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశలు పూర్తి అయ్యాయి. పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద నాయకులు పట్టుబట్టడంతో రెండు మూడు సార్లు కూడా రీకౌంటింగ్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కువ ఓట్లు తేడా ఉన్నా అభ్యర్థుల ఒత్తిడితో రీకౌంటింగ్ జరుపుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఎస్ఈసీ నూతన ఆదేశాలు జారీ చేసింది.