Hyderabad హైదరాబాద్ లో కొత్త టెన్షన్ మొదలైందని అంటున్నారు. తెలంగాణ లోని రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు తమ నాయకులను కాపాడుకోవడంలో బిజీగా ఉన్నాయంటున్నారు.
దీనికి కారణం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగబోయే మేయర్ ఎన్నికలు. ప్రధానంగా బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
Hyderabad గ్రేటర్ ఎన్నికలు
హోరాహోరీగా జరిగిన గ్రేటర్ ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన వారికి సంబంధిత రిటర్నింగ్ అధికారులు సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు. అనంతరం వారి ఎన్నికను అధికారికంగా గుర్తిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఇంకా మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో గెలిచిన కార్పొరేటర్లు కొత్త కౌన్సిల్ ఎప్పుడు కొలువు దీరుతుందా అన్ని ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నారని అంటున్నా
పార్టీలకు సవాల్…
గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచిన కార్పొరేటర్లను కాపాడుకోవడం ప్రధానంగా బీజేపీకి సవాల్గా మారిందని సమాచారం. బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తర్వాత వారితో పార్టీ ఆఫీస్లో నాయకులు సమావేశమయ్యారు. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి కార్పొరేటర్లను తీసుకెళ్లి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రమాణం చేయించారు. దీంతో పాటుగా కమలనాథులు వారిని ఓ కంట కనిపెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారని మరికొందరు భావిస్తున్నారు.