Tadipatri : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న సందర్భంగా అ కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మున్సిపాలిటీని వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.