Breaking: తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. తిరుమలలో ఇవేళ పోలీసులు, తిరుమల విజిలెన్స్ విస్తృత స్థాయిలో తనిఖీలు, సీసీ టీవీల పరిశీలన కార్యక్రమం చేయడంతో తిరుమలలో ఉగ్రవాదులు ప్రవేశించారనీ,, తిరుమలలో హై అలర్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి స్పందిస్తూ తిరుమలలో ఎలాంటి హై అలర్ట్ లేదని తెలిపారు.
సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి నుండి మెయిల్ రావడంతో అప్రమత్తమై పరిశీలించామని, అంతా బూటకమని తేలిందని అన్నారు. అకతాయి మెయిల్ గా భావిస్తున్నామని చెప్పారు. మెయిల్ విషయమై విచారణ జరుపుతున్నామని తెలిపారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భక్తులు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు.
AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్