YSRCP MP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ YS Jagan, వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్న వైసీపీ రెబల్ ఎంపి MP రఘురామ కృష్ణం రాజు Raghu rama krishnam raju ఇప్పుడు తాజాగా ఆ పార్టీకే చెందిన ఓ ఎంపీ MP ని టార్గెట్ చేశారు. బాపట్ల ఎంపి నందిగం సురేష్ Nandigam suresh పై ఏపి సీఐడి అధికారులకు లేఖ రాశారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ మిషనరీ సంస్థకు విదేశీ నిధులు వచ్చాయనీ, క్రైస్తవ మిషనరీ సంస్థకు ప్రతినిధిగా ఉంటూ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైయ్యారనీ, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపి సీఐడి అడిషినల్ డీజీ పివి సునీల్ కుమార్ లు లేఖ రాశారు.
మదర్ ఫ్లోరా ఫైత్ మినస్ట్రీస్ సర్వీస్ సొసైటీ క్రైస్తవ సంస్థలో నందిగం సురేష్ సభ్యుడుగా ఉన్నారనీ, హిందూ దళితుడైన నందిగామ సురేష్ ఆ సంస్థలో ఎలా సభ్యుడవుతారని ప్రశ్నించారు. ఆ సంస్థకు రూ.13.73 కోట్ల విదేశీ నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎన్ జీ ఓ ఆర్గనైజేషన్ కు వచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. నందిగం సురేష్ హిందువని చెప్పి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం బాపట్ల నుండి పోటీ చేశారని , ఆయన మతంపై విచారణ జరపాలని కోరారు. దీనిపై సీఐడిీ నిస్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ఒక వేళ నిస్పక్షపాతంగా విచారణ జరగకపోతే తాను కోర్టును ఆశ్రయించి కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ కోరతానని కూడా లేఖలో రఘు రామ కృష్ణం రాజు పేర్కొన్నారు. దీంతో రఘురామ కృష్ణం రాజు లేఖపై ఏపి సీఐడి ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.