Ysrcp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో తలెత్తిన వివాదాలు సంచలనాలకు దారితీస్తున్నాయి. మొదటి నుండి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రీతిలోనే వ్యవహరిస్తున్నట్లు, ప్రభుత్వంతో పనిలేదు అన్న తరహాలో ఆయన నిర్ణయాలు ఉన్నట్లు మీడియా కూడా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. ఇదే తరుణంలో మరోపక్క అసలు ఏకగ్రీవాలు ప్రోత్సహించేది లేదు అంటూ నిమ్మగడ్డ రమేష్ కి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి అల్లుడికి ఫోన్ చేసి బెదిరించినట్లు టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా తెగ ఊదర గొడుతూనే ఉంది.
ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ని ఏవిధంగా అరెస్టు చేశారు అదే రీతిలో కన్నబాబు ని అరెస్టు చేయాలని టిడిపి నేతలు మరియు చంద్రబాబు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు కన్నబాబు. బెదిరింపులకు పాల్పడిన ట్లు ఆడియో టేప్ తన పేరిట రావటం అవాస్తవమని కొట్టిపారేశారు. సదరు అభ్యర్థికి ఏకగ్రీవం అయితే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పటం జరిగింది తప్ప, ఎక్కడా కూడా బెదిరింపులకు పాల్పడిన లేదని స్పష్టం చేశారు.
Ysrcp : ఎమ్మెల్యే కన్నబాబు చాలెంజ్…
అంతేకాకుండా తనపై ఆరోపణలు చేస్తున్న వాళ్లు గానీ మీడియా గానీ అవి నిరూపిస్తే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కన్నబాబు చాలెంజ్ విసిరారు. ఎమ్మెల్యే కన్నబాబు..సర్పంచ్ అభ్యర్థి కి ఫోన్ చేసి బెదిరించినట్లు మీడియా సర్కిల్ లో ప్రసారం అవుతున్న ఆడియో టేప్ ఈ విధంగా ఉంది…‘ఎన్నికల్లో పోటీ చేస్తే కంప్లయింట్ ఇప్పించి డిస్క్వాలిఫై చేయిస్తాను, ఆ తరువాత మీరే ఇబ్బందులు పడుతారు’ అంటూ అభ్యర్థి బంధువుకు కన్నబాబు రాజు వార్నింగ్ ఇచ్చినట్లు సదరు ఆడియోలో ఉంది. ఈ ఆడియో టేప్ ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. మరోపక్క ఈ వ్యవహారంపై టీడీపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.