3 Capitals : ఏపి AP ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan mohan reddy ప్రకటించిన మూడు రాజధానులకు 3 Capitals కేంద్రం అనుకూలంగా ఉన్నట్లు మరో సారి వెల్లడి అయ్యింది. మూడు రాజధానుల అంశానికి సంబంధించి హైకోర్టు వివాదం నేపథ్యంలో ఇంతకు ముందే రాజధాని తరలింపు అంశం కేంద్రం తమ పరిధి కాదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా హైకోర్టు తరలింపు అంశం కూడా తమ పరిధిలోని కాదనీ, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలని కేందం తేల్చి చెప్పింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులలో భాగంగా అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని, కర్నూలును న్యాయరాజధానిగా పేర్కొన్నారు. ఈ క్రమంలో హైకోర్టు తరలింపునకు అనుమతులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చినట్లు వివరించారు.
హైకోర్టు తరలింపు అంశానికి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ గురువారం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. రాజ్యసభలో బీజెపీ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు అడిగిన ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అదే విధంగా మరే ఇతర నగరాల్లో హైకోర్టు బెంచ్ ల ఏర్పాటు ప్రతిపాదన ఏమి లేదని తెలిపారు, ఒక వేళ హైకోర్టు తరలింపు చేయాలన్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని న్యాయశాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే హైకోర్టు, ప్రభుత్వం ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటే కర్నులుకు హైకోర్టు తరలించుకోవచ్చని న్యాయశాఖ తెలియజేయడం నిజంగా సీఎం జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్ ఇచ్చినట్లే. కాకపోతే ఇప్పుడు హైకోర్టు తరలింపు వ్యవహారంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కీలకం కానున్నది.