ఈ ఏడాది నవంబర్ లో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి.
మీ సేవలు ఇక చాలు
ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ కంట్రోల్ చేయడంలో చాలావరకు విఫలం కావడంతో పాటు నల్ల జాతీయుడి వివాదం విషయంలో అత్యుత్సాహంగా వ్యవహరించడంతో దేశవ్యాప్తంగా ట్రంప్ కి చాలా వరకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అని ఇటీవల జరిపిన చాలా సర్వేలలో ఫలితాలు బయటపడ్డాయి. ముఖ్యంగా మీడియా ట్రంప్ కి చాలా వ్యతిరేకంగా మొదటి నుండి వ్యవహరిస్తూ వస్తోంది. కానీ ఎలాగైనా జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని డోనాల్డ్ ట్రంప్ ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి రెడీ అవుతున్నారు.
మనోళ్ళే టార్గెట్
దీనిలో భాగంగా అమెరికాలో ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండటంతో…. వారి ఓట్లను కొల్లగొట్టడానికి డోనాల్డ్ ట్రంప్… భారత్ ప్రధాని మోడీ జపం చేస్తున్నాడు. ఇందువల్లనే ప్రవాస భారతీయులు ఎక్కువగా దేశంలో నివసించే చోట ట్రంప్ మద్దతుదారులు….. గతంలో భారత్ వచ్చిన సమయంలో మోడీతో ట్రంప్ దిగిన ఫోటోలు వీడియోలతో ఎక్కువ క్యాంపెయిన్ చేస్తున్నారట. ప్రవాస భారతీయులకు మోడీ అంటే ఎనలేని ప్రేమ ఉండటంతో…..వారి ఓట్లు ఎలాగైనా తన ఖాతాలో పడాలని మోడీ లేనిదే నేను ఎన్నికలకు వెళ్ళను అన్నట్టుగా ట్రంప్ వ్యవహారం ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు టాక్. మరోపక్క ఉపాధ్యక్ష పదవికి ఎంతో వ్యూహాత్మకంగా ప్రవాస భారతీయురాలు కమల హరిస్ రంగంలోకి దిగడంతో…. ట్రంప్ పై దూకుడుగా వ్యవహరిస్తూ పోతుంది. దీంతో అమెరికాలో ఉండే ఎన్నారైలు మొత్తం ఆమెకు గంపగుత్తగా ఓట్లు వేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయినా లాభం లేనట్లే….
అయితే డోనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రవాస భారతీయుల ఓట్లు తనకే పడేలా… ఎన్నికల ప్రచారంలో జనవరిలో ఇండియా పర్యటన సమయంలో మోడీ తో కలసి అహ్మదాబాదులో….. స్టేడియంలో జరిపిన పెద్ద సమావేశం వీడియోని బాగా ఎన్నికల ప్రచారంలో వాడుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులు మాత్రం ట్రంప్ ఎన్ని ఫీట్లు చేసిన=నా, ఎన్ని డ్రామాలు ఆడినా ఓటు వేయకూడదని డిసైడ్ అయ్యారట. అంత ఖచ్చితత్వం ఏమిటి అని అడిగితే… చాలా పోల్స్ లో ఆయన ఓడిపోతున్నట్లు ఫలితాలు రావటమే దీనికి సూచిక అని చెబుతున్నారు.