Sachin Vaze ; ముకేశ్ అంబానీని హత్య చేయడానికి జరిగిన ఒక కుట్రని గత వారం పోలీసులు ఛేదించారు. ఇది దేశం మొత్తం సంచలనం సృష్టించింది. కానీ ఈ కుట్ర చుట్టూ అనేక అనుమానాలు.., అనేక కథనాలు, కథలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి..! ముంబైలోని ఓ పోలీసు అధికారి చుట్టూ ఈ వివాదం మలుపులు తిరుగుతుంది..!!
Sachin Vaze ; ఈ పోలీస్ ఎవరు..!? ఏం చేశారు..!?
సచిన్ వాజే ముంబై పోలీస్ అధికారి. ఆరేళ్ళ కిందట కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కీలక హోదాలో ఉండేవారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు సంపాదించారు. సుమారు 63 మందిని ఎం కౌంటర్ లో లేపేశారు. అటువంటి పోలీస్ అధికారి ఓ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అతనికి పోస్టింగ్ రాలేదు. విచారణ జరుగుతూనే ఉంది. దీంతో విసుగు చెంది రాజకీయాల్లో చేరిపోయారు. శివసేనతో చేరి, యాక్టీవ్ గా పని చేశారు. 2019 లో మహారాష్ట్రలో మళ్ళీ శివసేన ప్రభుత్వం వచ్చాక ఈ అధికారి మళ్ళీ పోలీస్ అయ్యారు. ఆ ప్రభుత్వానికి తూరుపుమొక్కగా మారారు. కొన్ని నెలల కిందట శివసేన ప్రభుత్వం మొదటి జర్నలిస్టు ప్రత్యర్థి అర్ణబ్ గోస్వామిని ఈ సచిన్ వాజేనే అరెస్టు చేశారు.
గత వారం నుండి రగులుతుంది..!!
గత వారం ముంబైలోని ముకేష్ అంబానీ ఇంటి దగ్గర బాంబులతో ఉన్న కార్ ని కనుకున్నారు. ఈ కేసుని పోలీసులు విచారణ జరుపుతూ ఉండగానే ఆ కార్ యజమాని హత్యకు గురయ్యారు. ఈ కేసుని దర్యాప్తు చేస్తుండగా…, ఆ కారు యజమాని కాల్ లిస్టులో ఈ సచిన్ వాజే నంబర్ కూడా ఉంది. ఈ ఇద్దరూ జరిపిన సంభాషణల కాల్ రికార్డ్ డేటా మహారాష్ట్ర ప్రతిపక్ష నేత ఫడ్నవిస్ సంపాదించారు. దీన్ని అసెంబ్లీ లో లెవనెత్తడంతో వాజే ని క్రైమ్ బ్రాంచ్ నుండి తప్పించారు. ఇది ఆ రాష్ట్రం మొత్తం వివాదంగా మారింది. పోలీసులు కూడా వర్గాలుగా విడిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తానికి ముకేష్ అంబానికి హత్య బెదిరింపు సమాచారం టెలిగ్రామ్ ఆప్ ద్వారా తీహార్ జైలు నుండి వచ్చినట్లు పోలీసులు కనుగున్నారు.
జాతీయ స్థాయిలో దర్యాప్తు..!? పోలీస్ చుట్టూ వల..!!
ఇది అత్యంత కీలకమైన కేసుగా మారింది. కేంద్రం రంగంలోకి దిగింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA ) కి అప్పచెప్పారు. ముందస్తు బెయిల్ కోరుతూ సచిన్ వాజే పిటిషన్ వేసుకున్నారు. హత్యకు గురైన కార్ ఓనర్ తో సచిన్ వాజే సంభాషణలు జరిపినట్లు, అతని ఫోన్ లోకెషన్ ఉన్న రుజువులు పోలీసులు చూపించడంతో ముంబై హై కోర్ట్ సచిన్ వాజే బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. ఇక్కడితో మళ్ళీ వాదనలు తీవ్రమవుతున్నాయి. ఈ సచిన్ వాజే ఫేస్ బుక్ లో ఓ విషయం పెట్టారు. “నన్ను మళ్ళీ ఒక బోగస్ కేస్ లో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఇలానే చేశారు. అప్పుడు నాకు 17 ఏళ్ళ సర్వీస్ పై ఆశ ఉంది కాబట్టి పోరాడాను. ఇప్పుడు ఏమి లేదు. జీవితాన్ని ముగించేయడమే” అంటూ పోస్ట్ పెట్టారు. మహారాష్ట్ర అధికార పార్టీ పత్రిక సామ్నాలో కూడా “అర్ణబ్ గోస్వామి అరెస్ట్ అయినప్పటి నుండి బీజేపీ, కేంద్రం హిట్ లిస్టులో సచిన్ వాజే ఉన్నారు.” అంటూ రాసుకొచ్చింది. గడిచిన రాత్రి 12 గంటల సమయంలో సచిన్ వాజిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుంది..? అనేది కీలకంగా మారింది..!!