Acharya : మెగాస్టార్ చిరంజీవి తన 150 రెండవ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. కొరటాల శివ, మెగా స్టార్,మెగాపవర్ స్టార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై మొదటినుంచి మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని వేసవి సెలవులకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆచార్య సినిమాకోసం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. ఈ సినిమా విషయంలో ఎప్పుడూ లేని విధంగా నైజాం పంపిణీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నాడు వరంగల్ శీను. ఈ నైజం హక్కుల గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మొదటగా ఆచార్య సినిమాను కొనాలని భావించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చివరి నిమిషంలో ఎంతో నిరాశ ఎదురైంది. మొదటిగా ఈ సినిమాను దిల్ రాజు 35 కోట్ల రూపాయలతో సొంతం చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను నైజాం హక్కుల 42 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. రవితేజ క్రాక్ సినిమా విషయంలో వరంగల్ శ్రీను దిల్ రాజును ఉద్దేశించి మీడియా ఎదుట ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ, దిల్ రాజు మధ్య కొన్ని విభేదాలు ఉండడంతో ఈ సినిమాను దిల్ రాజుకు అమ్మడానికి దర్శకుడు అనుకూలంగా లేడని తెలుస్తోంది. ఆచార్య సినిమా విడుదలకు ముందే ఇంతటి బిజినెస్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే ఒక యువతి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.