Adipurush: టాలీవుడ్ సినిమాలో పాన్ ఇండియన్ సినిమాలు విరివిగా రూపొందుతున్నాయి. బాహుబలి సినిమాల తర్వాత మళ్ళీ సీక్వెల్ సినిమాలు నిర్మిస్తున్నారు. అది కూడా భారీ బడ్జెట్తో పాన్ ఇండియన్ రేంజ్లో. ప్రభాస్ – రానా ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన బాహుబలి సిరీస్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్ఠించింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ సీక్వెల్ సినిమాలుగా వస్తుందీ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప -2ది రూల్, యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2.
అయితే, ఇప్పుడు మళ్ళీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా ఓ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆయన హీరోగా ఇటీవల వచ్చిన పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. ఈ సినిమా ప్రభాస్ను, ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ సినిమా ఉంది. దీనిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్ రెండు భాగాలుగా వస్తుంది కాబట్టి దీనికి ఆ స్కోప్ ఉందనే అందరూ భావిస్తున్నారు.
Adipurush: ఆదిపురుష్ సినిమా సీక్వెల్ చేసే స్కోప్..!
అయితే, ప్రభాస్ బాలీవుడ్లో చేస్తున్న స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ సినిమా సీక్వెల్ చేసే స్కోప్ ఉందని దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్కు చెప్పాడట. దీనికి సంబంధించిన చర్చలు జరిపిన తర్వాత ఆ అవకాశం ఉందని ప్రభాస్ కూడా నమ్మడంతో దర్శకుడికి ఆదిపురుష్ సీక్వెల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆదిపురుష్ పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఇప్పుడు ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!