Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్గా మిగిలాయి. బాహుబలి సిరీస్తో వచ్చిన క్రేజ్ ఈ దెబ్బకు కొంత తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ సాధించిన పాన్ ఇండియా స్టార్ క్రేజ్ను ఇప్పుడు అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కన్నడ హీరో యష్, కోలీవుడ్ స్టార్స్ విజయ్, ధనుష్ లాంటి వారూ అందుకున్నారు. కాబట్టి ఆయన రేంజ్కు ఒక్కొక్కరూ చేరుకుంటుండటంతో ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్స్ మీద గట్టిగా ఫోకస్ పెట్టారు.
ఇటీవల భారీ అంచనాల మధ్య వచ్చిన రాధే శ్యామ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. పామిస్ట్ పాత్రలో నటించిన ప్రభాస్కు ఈ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. కనీసం బ్రేకీవెన్ టార్గెట్కు దరిదాపుల్లోకి కూడా వసూళ్ళు రాలేకపోయాయి. దాంతో ఆ సినిమా ఎఫెక్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న సలార్ సినిమా మీద పడుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా మేకింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట దర్శక నిర్మాతలు.
Prabhas: రీ షూట్, రీ ఎడిటింగ్ ..!
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ సినిమా సలార్ షూటింగ్ అండ్ ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారట. సాహో, రాధే శ్యామ్ సినిమాల రిజల్ట్ దీనికి కారణం అంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూట్ చూసుకొని అవసరమనిపించిన కొన్ని సీన్స్ను మళ్ళీ రీ షూట్ చేస్తున్నారట. అలాగే, ఆల్రెడీ ఎడిటింగ్ పూర్తైన సన్నివేశాలకు మళ్ళీ రీ ఎడిటింగ్ చేస్తున్నట్టు తాజా సమాచారం. అలాగే, బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ సినిమా విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే పాటిస్తున్నారట మేకర్స్. మరి సలార్ సినిమాతో ప్రభాస్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!