కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ మీరా మిధున్ షాకింగ్ కామెంట్ లు చేసింది. సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష పై ఎవరూ ఊహించని విధంగా ఆరోపణలు గుర్తించింది. పూర్తి విషయంలోకి వెళ్తే హీరోయిన్ త్రిష తన కెరియర్ ని కావాలని నాశనం చేసినట్లు మీరా మిధున్ చెప్పుకొచ్చింది. తనని సైడ్ చేయడం వలనే త్రిష సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా తెలియజేసింది.
అంతేకాకుండా హీరోయిన్ త్రిషకి కుల మరియు మత పిచ్చి ఎక్కువ అని, తన లాంటి ఎంతో మంది నటులు కోలీవుడ్ ఇండస్ట్రీలో త్రిష కుల ప్రస్తావన తీసుకొచ్చి బలి చేసినట్లు మీరా మిథున్ తెలిపింది. ఈ రకంగానే ఎన్నై ఇరిందాల్ రజినీకాంత్ పేట సినిమాలలో తన క్యారెక్టర్ కి సంబంధించిన సన్నివేశాలు కట్ అవటానికి త్రిష యే కారణమంటూ మీరా షాకింగ్ కామెంట్ చేసింది. దీంతో మీరా మిథున్ చేసిన కామెంట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!